హైదరాబాద్: ఏటీఎంల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను సిపి మహేశ్ భగవత్ మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… రాచకొండ పరిధిలో ఇటీవల 2 ఏటీఎంల్లో చోరీ చేశారని చెప్పారు. ఈ నెల 17న వనస్థలిపురంలో పోలీస్ వాహనం దొంగిలించారు. తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ ఇండీక్యాష్ ఏటీఎంలో దొంగతనం చేశారు. దొంగిలించిన పోలీస్ వాహనంతోనే అబ్దుల్లాపూర్ మెట్ లో చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంను ధ్వంసం చేసి రూ.35వేలు చేశారు. ఈ ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశాం, మరో నలుగురు పరారీలో ఉన్నారని సిపి తెలిపారు. నిందితులపై ఆరు రాష్ట్రాల్లో 11 కేసులున్నాయి. చోరీ అనంతరం నిజామాబాద్ ఇందల్వాయి వద్ద మళ్లీ వాహనం వదిలి వెళ్లినట్టు ఆయన తెలిపారు. అటు నాచారంలో చోరీలకు పాల్పడిన ఇద్దరని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 42తులాల బంగారు నగలు, 70తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న నిందితులు నాచారంలో 2 ఇళ్లలో చోరీకి పాల్పడినట్టు సిపి మహేశ్ భగవత్ మీడియా సమావేశంలో తెలిపారు.
Interstate Gang Arrested in Hyderabad