Wednesday, May 29, 2024

అత్యాచారం చేసి… కదులుతున్న రైళ్లో నుంచి బయటకు నెట్టేసి…

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: కదులుతున్న రైళ్లో ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి పదునైన ఆయుధంతో తలపై కొట్టి రైళ్లో నుంచి బయటకు నెట్టేసిన సంఘటన మహారాష్ట్రలోని నవీ ముంబయి ప్రాంతం వషి క్రిక్ బ్రిడ్జ్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వషి రైల్వే స్టేషన్‌కు రెండున్నర కిలో మీటర్ల దూరంలో 23 ఏళ్ల యువతి తీవ్రంగా గాయపడి కనిపించడంతో రైల్వే స్టేషన్ మేనేజర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జిఆర్‌పి కానిస్టేబుల్ బౌషేబ్ షిండే అక్కడి చేరుకొని అమ్మాయిని స్థానిక ఎన్‌ఎంఎంసి ఆస్పత్రికి తరలించాడు. ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో జెజె ఆస్పత్రికి తరలించాలని పరీక్షించిన వైద్యులు సూచించారు. ఆమె కుటుంబ సభ్యులు తిత్వాలా ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు 307, 376 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సిసి టివి ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అమ్మాయి స్పృహాలోకి రాగానే సమాచారాన్ని సేకరించి దర్యాప్తు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News