హైదరాబాద్: పురపాలకశాఖకు కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, నిర్మాలా సీతారామన్ కు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ నగర సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ కోసం నిధులు మంజూరు చేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పనులకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కెటిఆర్ కోరారు. వరంగల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న మెట్రో నియో ప్రాజెక్టు, పురపాలకశాఖ ద్వారా పట్టణాల్లో చేపట్టిన పనులు, పురపాలికల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మానవ వ్యర్ధాల ట్రీట్ మెంట్ ప్లాంట్లు.. బయో మైనింగ్, అండర్ గ్రాండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆమోదించడంతో పాటు 20 శాతం నిధులను రానున్న కేంద్ర బడ్జెట్ లో కేటాయించాలని లేఖలో కేంద్రాన్ని కోరారు.