Tuesday, April 30, 2024

ప్రేమ… పెళ్లైన ఆరు నెల్లకే చంపేశాడు….

- Advertisement -
- Advertisement -

Lover killed his wife in chittoor

అమరావతి: ఓ యువతిని ప్రేమించాడు… పెళ్లి చేసుకున్నాడు…  మద్యానికి బానిసగా మారి ఆ యువతిని భర్త చంపేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిటి పురానికి చెందిన ఉమా అనే యువతికి తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి విదేశాలకు వెళ్లి పని చేస్తోంది. ఉమా తన పెద్దమ్మ ఇంట్లో ఉంటుంది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పరిధిలోని శాంతి నగర్ లో తన బంధువుల ఇంటికి ఉమా వెళ్లినప్పుడు  అక్కడ పక్కింట్లో ఉండే రామాంజనేయులు అనే యువకుడు పరిచయమయ్యాడు. పరిచయం ప్రేమగా మారడంతో అతడు ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. మధనపల్లెలో రెంట్ కు రూమ్ తీసుకొని చేనేత కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామాంజనేయులు మద్యానికి బానిస కావడంతో రోజు భార్యతో గొడవ పెట్టుకునేవాడు. మగ్గం నేసేందుకు రామాంజనేయులు రాకపోవడంతో యజమాని రామాంజనేయులు ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. కిటీకిలో నుంచి తొంగి చూడగా మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే అతడు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కిందపడి ఉందని పరీక్షించిన ఎస్ఐ లోకేష్ తెలిపాడు. భర్త పరారీలో ఉండడంతో అతడే చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేయించగా నీరుగట్టువారి పల్లె రోడ్డుకు వెళ్లి ఆగిపోయిందని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి భర్త వాహనం వెళ్లిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News