Sunday, May 5, 2024

రెండో రోజూ ఆగ్రాలో పలు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

Minister Vemula prashanth reddy visited Agra

హైదరాబాద్: సచివాలయ నిర్మాణం కోసం ఇసుకరాయి పరిశీలనకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. రెండో రోజు ఆగ్రాలోని క్వారీల్లోకి వెళ్లి స్టోన్ క్వాలిటీని మంత్రి బృందం పరిశీలించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సచివాలయ నిర్మాణం కోసం రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం ఇసుకరాయి కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. శుక్రవారం రాజస్థాన్‌లోని ధోల్పూర్, శనివారం ఆగ్రాలో పర్యటన కొనసాగుతోంది. తాజ్‌మహల్, ఎర్రకోటను మంత్రి బృందం పరిశీలించింది. కట్టడాలకు వాడిన రాళ్ల గురించి అక్కడి అధికారులు మంత్రి బృందానికి వివరించారు. మంత్రి క్వారీల్లోకి స్వయంగా వెళ్లి స్టోన్ క్వాలిటీని పరిశీలించారు. మంత్రి వెంట ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, షాపూర్ జీ సంస్థ ప్రతినిధి లక్ష్మణ్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News