- Advertisement -
కొల్హాపూర్, నాగ్పూర్ మధ్య సోమ, శుక్రవారాల్లో అందుబాటులోకి
ప్రయాణికులకు ఈనెల 12వ తేదీ నుంచి అందనున్న సేవలు
హైదరాబాద్: ప్రయాణికుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. కొల్హాపూర్, నాగ్పూర్ మధ్య సోమ, శుక్రవారాల్లో ఈనెల 12వ తేదీ నుంచి సేవలను అందించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. మరో రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొల్హాపూర్ నుంచి నాగ్పూర్ వరకు సోమ, శుక్రవారాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయని ద.మ.రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. నాగ్పూర్ నుంచి కొల్హాపూర్కు ఈ నెల 13 నుంచి అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
Railways to run Two more special trains
- Advertisement -