Tuesday, April 30, 2024

బ్యాగులో మృతదేహం……

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: బ్యాగులో గుర్తు తెలియని మృతదేహం కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుప్పం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నడుమూరు గ్రామ పరిధిలోని కుప్పం-కృష్ణగిరి జాతీయ రహదారి పక్కన బ్యాగ్ కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బ్యాగ్ తెరిచి చూడగా కాళ్ల నుంచి నడుము వరకు ఉన్న మృతదేహం కనిపించింది. మిగతా సగభాగంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్ కేసుల గురించి వాకబు చేస్తున్నారు. మృతదేహం ఎవరదని తెలిస్తే నిందితులను పట్టుకోవచ్చని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News