Tuesday, April 30, 2024

ప్రేమ వివాహం… భర్త హత్య… భార్య ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

Husband murder after wife suicide in Ongole

 

అమరావతి: యువతి యువకుడు ప్రేమించుకున్నారు… పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు… గతా మూడు నెలల నుంచి ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో వేరు వేరు జీవిస్తున్నారు… భర్త హత్యకు గురికావడంతో భార్య ఉరేసుకొని చనిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలులోని సంజయ్‌గాంధీ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. శ్రీవల్లి(23), నాగారాజు(25)కు నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఉండడంతో ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలియడంతో శ్రీవల్లి తండ్రి వెంకట్రావు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువతి, యువకుడి కుటుంబ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. నూతన దంపతులు హిల్ టవర్స్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. నాగారాజు ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా శ్రీవలి స్థానికంగా ఉండే ఓ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తోంది. మూడేళ్ల నుంచి సజావుగా సాగిన వీరి కాపురంలో రెండు నెలల క్రితం మనస్పర్థలు రావడంతో నాగరాజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు గొడవలు రావడంతో ఇద్దరు వేరు వేరుగా జీవనం సాగిస్తున్నారు. టంగుటూరు మండలం మర్లపాడు గ్రామం శివారులోని ఇనగలేరులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డిఎస్‌పి ప్రసాద్, సింగరాయకొండ సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ నాయబ్ రసూల్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నాగరాజుది గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం కత్తి పోట్లు ఉండడంతో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి సోదరుడి ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీవల్లి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాగరాజు మాత్రం ఇంటి నుంచి మరో ఆటో డ్రైవర్ తీసుకెళ్లినట్టు చుట్టు పక్కలవాళ్లు పోలీసులకు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News