Wednesday, May 8, 2024

మందలించాడని.. తండ్రిని చంపిన కొడుకు

- Advertisement -
- Advertisement -

Son killed father in Nalgonda district

నల్లగొండ: జిల్లాలోని మాడుగులపల్లి మండలం పాములపాడులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. మందలించాడనే కోపంలో ఓ కొడుకు తన కన్న తండ్రిని కత్తితోపొడిచి చంపేశాడు. పోలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిన ఎల్లయ్య ఇంట్లోనే ఉండకుండా తనకు చేదోడు.. వాదోడుగా ఉండి పనికి రావాలని మందలించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. ఆవేశానికి లోనైనా నాగరాజు తండ్రిని కత్తితో పొడిచాడు. తీవ్ర రక్తస్రావమైన ఎల్లయ్యను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. తండ్రిని పొడిచి పారిపోతున్న కొడుకును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Son killed father in Nalgonda district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News