Tuesday, May 7, 2024

చెలరేగిన సన్‌రైజర్స్ బౌలర్లు.. 120 పరుగులకే పంజాబ్ ఆలౌట్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 2021లో భాగంగా చెపాక్‌ మైదానంలో పంజాబ్‌ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో పంజాబ్ జట్టు 19.4 ఓవర్లలోనే కేవలం 120 పరుగులే చేసి ఆలౌటైంది. దీంతో పంజాబ్, సన్ రైజర్స్ జట్టును 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టును సన్ రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో బెంబేలెత్తించారు. దీంతో మ్యాచ్ ప్రారంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోవడంతో పంజాబ్  తప్పకుండా వికెట్లు కోలుకోలేకపోయింది. మయాంక్‌ అగర్వాల్‌(22), షారుక్‌ ఖాన్‌(22)లు మాత్రమే ఇరవై ప్లస్ స్కోరు సాధించారు. మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఐపిఎల్‌ 2021లో అత్యల్ప స్కోర్‌ నమోదైంది. హైదరాబాద్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టగాడు. అభిషేక్‌ శర్మ 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్, రషీద్ ఖాన్, కౌల్ లకు తలో వికెట్ దక్కింది.

  IPL 2021: PBKS all out at 121 runs against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News