Tuesday, April 30, 2024

మాజీ ఎంఎల్ఎ సీతారామయ్య కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Former MLA Sitharamaiah passes away in Khammam

హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్‌ఎ బొగ్గారపు సీతారామయ్య(85) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1978లో సుజాతనగర్ నియోజకవర్గంలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి పువ్వాడ నాగేశ్వర్ రావు పై విజయం సాధించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు స్వాతంత్య్ర సమరయోధుడిగా ఉన్నారు. కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్‌లో ఉంటూ హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News