Tuesday, April 30, 2024

నకిలీ నోట్లు ముద్రిస్తున్న దంపతుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

couple arrested for printing counterfeit notes in warangal

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో నకిలీ నోట్లు ముద్రిస్తున్న దంపతులు బుధవారం పట్టబడ్డారు. గత కొంతకాలంగా హన్మకొండ, వరంగల్ లో రద్దీగా ఉండే షాపుల్లో 100, 50, 20 రూపాయల దొంగనోట్లు చెలమణి అవుతున్నాయి. పట్టణంలో రెండు రోజుల క్రితం 50 రూపాయాల నోట్ల చలామణి విషయం వెలుగుచూసింది. దీనిని సిరీయస్ గా తీసుకున్న పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి దొంగ నోట్ల ముఠా ఆటకట్టించి అరెస్ట్ చేయించారు. కాశీబుగ్గకు చెందిన దంపతులు వంగరి రమేశ్, సరస్వతిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.10 లక్షల నకిలీ కరెన్సీ, ప్రింటర్, ఇతర సామగ్రి, స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News