Wednesday, May 8, 2024

సూరారంలో కన్న కొడుకును చంపిన కసాయి తల్లి

- Advertisement -
- Advertisement -

Mother Killed Son in Suraram

సూరారం: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని సూరారంలో మంగళవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడిని హత్యచేసింది. మహిళ రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ మరో వ్యక్తితో కలిసి సూరారంలోని నివాసం ఉంటుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన మూడేళ్ల కుమారుడిని విచక్షణారహితంగా కొట్టి హతమార్చింది. దెబ్బలకు తాళలేక బాలుడు అక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా బాలుడు చనిపోయిన్టటు వైద్యులు వెల్లడించారు. మృతుడిని ఉమేశ్ గా గుర్తించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News