Tuesday, May 7, 2024

ఎపిలో తగ్గుతున్న కరోనా

- Advertisement -
- Advertisement -

7796 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 89,732 కరోనా పరీక్షలు నిర్వహించగా, 7,796 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 77 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 14,641 మంది బాధితులు కోలుకున్నారు. ఎపిలో ఇప్పటిదాకా కోవిడ్-19తో మృతిచెందిన వారి సంఖ్య 11,629కి చేరింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 17,71,007కి పెరిగాయి. ఇప్పటివరకు 16,51,790 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,07,588 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,302, చిత్తూరులో 1,210 పాజిటివ్ కేసులు బయటపడగా… అతితక్కువ కేసులు కర్నూలు జిల్లాలో 147 కొత్త కేసులు నమోదయ్యాయని ఎపి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

7796 new covid-19 cases reported in AP

7796 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News