Wednesday, May 15, 2024

ఢిల్లీలో కొత్తగా 316 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Delhi reports 316 new COVID-19 cases

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసులు మరింతగా తగ్గాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 71,879 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 316 మందికి కరోనా సోకింది. 41 మంది కరోనాతో మృతిచెందారు. ఢిల్లీలో కరోనా నుంచి తాజాగా 521 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,29,791కి చేరింది. ఇప్పటివరకు 14,00,161 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ రాజధానిలో ప్రస్తుతం 4,962 కరోనా యాక్టివ్ కేసులుండగా, 24,668 మంది మృత్యువాతపడ్డారు. పాజివిటీ రేటు 0.44శాతంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News