Wednesday, May 8, 2024

పూటుగా మద్యం తాగి…. కారుతో బీభత్సం

- Advertisement -
- Advertisement -

Car accident in drunk and drive in kukatpally

మేడ్చల్: పూటుగా మద్యం తాగి కారుతో బీభత్సం సృష్టించిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలో జరిగింది. ఈ ప్రమాదం నుంచి మహిళ తప్పించుకొని స్వల్పంగా గాయపడింది. రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మల్లంపేటలో సిహెచ్ నోహిత్ రెడ్డి(24) అనే యువకుడు ప్రైవేటు సంస్థలో పని చేసేవాడు. రోహిత్ రెడ్డి తండ్రి యుగందర్ రెడ్డి విద్యుత్ శాఖలో పని చేస్తున్నాడు.  తండ్రి కారు తీసుకొని మూసాపేట నుంచి కెత్లాపూర్ వెళ్లాడు. అక్కడ పీకలదాకా మద్యం తాగి అనంతరం కారులో ఐడిఎల్ చెరువు వైపు వేగంగా వస్తున్నాడు. కెత్తాపూర్ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టబోయాడు. ఆమె ఈ ప్రమాదాన్ని తప్పించుకొని స్వల్పంగా గాయపడింది. అదే వేగంతో వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో కారు ధ్వంసం కావడంతో విద్యుత్ స్తంభం కూలిపోయింది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని శ్వాస పరీక్ష చేయగా 162 సాంద్రత నమోదైంది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News