Monday, April 29, 2024

బాలీవుడ్‌లోకి సాయిపల్లవి

- Advertisement -
- Advertisement -

Sai pallavi entry into bollywood

సాయి పల్లవి టాలెంట్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేచురల్ బ్యూటీ నటనకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే.. ఈ అమ్మడు డబ్బే ప్రధానంగా సినిమాలు చేసే రకం కాదు. తన క్యారెక్టర్ నచ్చా లి, సమ్ థింగ్ డిఫరెంట్ అనిపిస్తే తప్ప.. సినిమాకు సైన్ చేయదు. ఆ విధంగా ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వదిలేసుకుంది. అందులో స్టార్ హీరోల సినిమా లు కూడా ఉన్నాయి. ఆ విధంగా సెలక్టివ్ సినిమాలను ఎంచుకునే సాయిపల్లవి.. మెజారిటీగా హిట్లనే తన ఖాతాలో వేసుకుంటోంది. ఇక సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి కూడా చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయట. లేటెస్ట్ గా ఓ ప్రముఖ బ్యానర్ ఆమెకు మంచి ఆఫర్ ఇచ్చిందట. బాలీవుడ్‌కు వెళ్లడానికి ఈ అమ్మడు కూడా సిద్ధంగానే ఉందని తెలిసింది. అయితే.. ఖచ్చితం గా కథ మాత్రం నచ్చాల్సిందే. అన్నీ ఒకే అయితే.. త్వరలోనే ఈ కేరళ కుట్టి బాలీవుడ్‌లో అడుగు పెట్టడం ఖాయమేనట. కాగా టాలీవుడ్‌లో సాయిపల్లవి నటించిన రెండు చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కానున్నాయి. అందులో ‘లవ్ స్టోరీ’ ఒకటికాగా.. రానాతో నటించిన ‘విరాట పర్వం’ రెండోది. ప్రస్తుతానికి ఈ రెండు చిత్రాలపైనా మంచి అంచనాలున్నాయి.
25 కోట్ల ‘సారంగ దరియా’…
సాయి పల్లవి హీరోయిన్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ మ్యూజిక్ ఆల్బమ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. సాయి పల్లవిపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ ‘సారంగ దరియా…’ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. యూట్యూబ్‌లో విడుదలైన నెల రోజుల్లోనే 10 కోట్ల వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించిన ఈ పాట అతి తక్కువ కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఏకంగా నాలుగు నెలల్లో 25 కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతూ కొత్త రికార్డును సృష్టించింది ఈ పాట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News