Monday, May 6, 2024

నదిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్‌లో రెండు రోజుల క్రితం దూకి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట మృతదేహాలు దొరికాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమజంట ఒకరినొకరు చున్నీతో కట్టుకొని సోమవారం నాగావళి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా మృతదేహాలు కనిపించలేదు. రెండు రోజుల తరువాత మృతదేహాలు నదిలో తేలడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాకేష్ స్వస్థలం బొబ్బిలి, ప్రియురాలు కురుపామ్‌కు చెందిన అమ్మాయిగా గుర్తించారు. వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వీళ్ల ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News