Saturday, April 27, 2024

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Husband commits suicide after wife abuse

 

కరీంనగర్ : కట్టుకున్న భార్య వేధింపులు తాళలేక భర్త తనువుచాలించిన ఘటన సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. గొడిశాలకు చెందిన మిడిదొడ్డి ప్రకాశ్‌ (31) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రశాంత్‌రావు తెలిపారు. ప్రకాశ్‌ తన భార్య ఆమని వేధింపులతో మనోవేదనకు గురై సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరి మధ్య గత కొంత కాలంగా తీవ్ర మనస్థాపనలు చోటుచేసుకున్నట్లు చెప్పారు. తన కుమారుడి మృతికి కోడలే కారణమని  మృతుడి తల్లి సౌందర్య  పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఈ మేరకు మంగళవారం ఆమనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News