ముంపు బాధితులకు పరామర్శ
హైదరాబాద్: జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం ఎల్బినగర్లోని ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ సరూర్నగర్ డివిజన్లోని పలు కాలనీల్లో పొంగి పోర్లుతున్న నాలాలను పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో నాలాల విస్తరణ పనులు ఎస్ఎన్డిపి ఫస్ట్, సెకండ్ ఫేస్లో మొత్తం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికీ నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎల్బినగర్ జోనల్ కమిషనర్ను మేయర్ ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులతో ముచ్చటించిన మేయర్ వారిని పరామర్శించారు. స్థానికులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గడ్డి అన్నారం కార్పోరేటర్ ప్రేమ్ మహేశ్వరరెడ్డి, సరూర్నగర్ కార్పొరేటర్ శ్రీవాణితో పాటు జిహెచ్ఎంసి ఎల్బినగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, ఎస్ఈ అశోక్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్యలు పాల్గొన్నారు.