- Advertisement -
అమరావతి: దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించింది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే ఎపిలో కరోనా విజృంభణ కాస్త తగ్గుముఖం పడుతోంది. కానీ రోజువారీ పాజిటివ్ కేసులు 2వేలకుపైనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 91,594 మందికి పరీక్షలు నిర్వహించగా 2,672 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 18 మరణాలు సంభవించాయి. తాజాగా మరో 2,467 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 25,041 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
- Advertisement -