Wednesday, May 1, 2024

అందువల్లే ఓటమి: విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

లీడ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలుకావడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. ఈ మ్యాచ్‌లో స్కోరు బోర్డుపై ఉన్న భారీ పరుగులే తమను ఒత్తిడికి గురిచేశాయన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమని మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ఆతిథ్య జట్టు చెలరేగి పోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 354 పరుగుల ఆధిక్యం సాధించడంతో తమ బ్యాట్స్‌మెన్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీని ప్రభావం మ్యాచ్‌పై స్పష్టంగా కనిపించింది. అయినా రోహిత్, పుజారాతో పాటు తాను మెరుగ్గానే బ్యాటింగ్ చేశాం. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ ఒత్తిడిని తట్టుకోలేక వికెట్లను పారేసుకున్నారు. దీంతో మ్యాచ్‌లో ఘోర పరాజయం తప్పలేదని కోహ్లి పేర్కొన్నాడు.

Kohli responds on 3rd Test against England

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News