Wednesday, May 15, 2024

ఎపిలో 1,502 మందికి కరోనా.. 16మంది మృతి

- Advertisement -
- Advertisement -

1502 new covid cases reported in andhra pradesh

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 63,717 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1,502 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2019702కి చేరింది. కొత్తగా 16 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 13903 కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో1,525మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1990916కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14883 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 2,68,09,774 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూర్ జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. కాగా నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 260 కేసులు వెలుగుచూశాయి. చిత్తూరు జిల్లాలో ప్రమాదకరంగా 208 కొత్త కేసులు వెలుగుచూశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News