- Advertisement -
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. షోపియాన్ జాల్లా కాష్వాలోని చిత్రగ్రామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆపరేషన్ సెర్చ్ జరిపాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఓ ఉగ్రవాది మృతి చెందినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇంకా భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Terrorist killed in Encounter by security forces in Shopian
- Advertisement -