Tuesday, May 21, 2024

తిరుమలలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

Huge Pilgrims visit Tirumala Temple on Wednesday

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. నిన్న 28,880 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి 17,350మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.1.95 కోట్లు కానుకల రూపంలో వచ్చాయి. తిరుపతి శ్రీనివాసంలో సర్వదర్శన టోకెన్ల ప్రక్రియను టిటిడి ప్రారంభించింది. శ్రీవారి సర్వదర్శనం కోసం రోజుకు 8వేల టోకన్లు ఇస్తుంది. ఈనెల 25 నుండి ఆఫ్ లైన్ లో ఇస్తున్న టికెట్లను నిలుపివేయనున్నట్లు టిటిడి అదికారులు తెలిపారు. చేయనున్న టీటీడీ కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరు తప్పనిసరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని టిటిడి అదికారులు భక్తులను కోరారు.

Huge Pilgrims visit Tirumala Temple on Wednesday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News