- Advertisement -
మన తెలంగాణ/మోత్కూరు: యాద్రాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన కె.బాలాజీ అండర్ 17 విభాగంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ఈనెల 8,9,10 తేదీలలో గోవాలో జరిగే కబడ్డీ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరుపున కబడ్డీ ఆడనున్నాడు. దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ సదరు క్రీడాకారునికి తన ప్రోత్సాహంగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించి రాష్ట్రానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాక్షించారు.
- Advertisement -