Tuesday, April 30, 2024

43 మంది మందుబాబులకు జైలు

- Advertisement -
- Advertisement -
43 sent to jail for drunk driving in Hyderabad
మద్యం తాగి వాహనాలు నడుపుతు సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డ మందుబాబులు
రూ.17,100 జరిమానా విధించిన కోర్టు

హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 43మంది మందుబాబులకు కూకట్‌పల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఈ నెల 11వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూకట్‌పల్లి, మియాపూర్, షాద్‌నగర్, శంషాబాద్‌లో తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మద్యం తాగి వాహనాలు నడుపుతూ 100మంది పట్టుబడ్డారు. ఇందులో కూకట్‌పల్లిలో 30, మియాపూర్‌లో 30, షాద్‌నగర్‌లో 9, శంషాబాద్‌లో 31మంది పట్టుబడ్డారు. వీరిలో 43మందికి జైలు శిక్ష విధించగా, మరికొందరికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతు పట్టుబడ్డ వారికి రూ.17,100 జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి రూ.1,06,600 జరిమానా విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News