Tuesday, April 30, 2024

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

- Advertisement -
- Advertisement -

Fuel Prices hiked again in India

న్యూఢిల్లీ : దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.107.94, డీజిల్‌ ధర రూ.96.67కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.113.80, డీజిల్‌ రూ.104.75కు పెరిగింది. ఇక,  హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.112.27, డీజిల్ ధర రూ.105.46కు పెరిగాయి.

కాగా, సెప్టెంబర్ 29 నుంచి పెట్రోల్ ధరలు 21 సార్లు పెరిగాయి. లీటరుకు రూ.84 వంతున అదనంగా పెరగడం గమనార్హం. అలాగే సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ ధరలు లీటరుకు రూ.7.70 వంతున అదనంగా 24 సార్లు ధరలు పెరిగాయి.

Fuel Prices hiked again in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News