Tuesday, May 21, 2024

పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పించిన బాలకృష్ణ..

- Advertisement -
- Advertisement -

Balakrishna pay tribute to Puneeth Rajkumar

హైదరాబాద్: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహానికి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం పునీత్ పార్థీవ దేహాన్ని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. ఈ నేపథ్యంలో భారీగా అభిమానులు స్టేడియానికి తరలివస్తున్నారు. పలువురు సినీ ప్రముఖలు కూడా స్టేడియానికి వచ్చి పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పిస్తున్నారు. కొద్దిసేపటిక్రితం నందమూరి బాలకృష్ణ, ప్రభుదేవాలు పునీత్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ తోపాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా, నిన్న జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా గుండె పోటు రావడంతో తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన పునీత్ కన్నుమూశారు. దీంతో కన్నడ చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది.

Balakrishna pay tribute to Puneeth Rajkumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News