Saturday, April 27, 2024

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి పార్ధీవ దేహానికి నివాళులర్పించిన నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Ministers condolences to Srinivas Goud mother death

మహబూబ్‌నగర్‌: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ మృతిపట్ల పలువురు మంత్రలు సంతాపం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయన తల్లి శాంతమ్మ పార్ధీవ దేహానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆయన ఓదార్చారు. సిఎం కెసిఆర్, హరీష్ రావ్ లతోపాటు మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌ రెడ్డిలు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి గుండెపోటుతో శాంతమ్మ తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను  జిల్లా కేంద్రంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Ministers condolences to Srinivas Goud mother death

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News