Tuesday, April 30, 2024

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో చలి పంజా..

- Advertisement -
- Advertisement -

Adilabad Reports Massive Cold Weather

అదిలాబాద్: తెలంగాణలో గత వారం రోజులుగా చలి తీవ్రత అధికమైంది. ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. జిల్లాలో సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. అలాగే, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తిర్యాణి మండలం గిన్నెధరిలో 3.5 డిగ్రీల కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సిర్పూర్(యూ) 4.0, వాంకిడిలో 5.0, బెలాలో 3.8, జైనాథ్ లో 4.9, అర్లిటిలో 3.9 డిగ్రీలుగా నమోదు కావడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు.

Adilabad Reports Massive Cold Weather

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News