Tuesday, April 30, 2024

రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Fire breaks out at godown in Rajasthan

జైపూర్‌: రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామును అల్వార్ జిల్లా నీమ్రానాలోని కన్సూమర్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా 12 ఫైర్‌ ఇంజిన్లతో సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్థినష్టం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Fire breaks out at godown in Rajasthan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News