Tuesday, April 30, 2024

అందాల భామలు.. లేత మెరుపు తీగలు

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్త భా మలు యూత్‌ను మైమరపించారు. మొదటి చిత్రంతోనే కుర్రకారు గుండెల్లో నిలిచిపోయారు. ఊహించని విజయాలు అందుకొని దర్శక నిర్మాతల ఫేవరేట్ హీరోయిన్స్‌గా నిలిచారు. మొదటి చిత్రం ‘ఉప్పెన’తో యువకులను మురిపించిన బ్యూటీ కృతిశెట్టి. రెండవ చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’తో ఈ భామ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. కా మెడీ ఎంటర్‌టైనర్ ‘జాతిరత్నాలు’తో ఊహించని విజయాన్ని అందుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. ఈ పొడుగు కాళ్ల సుందరికి టా లీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ శ్రీలీల. ఈ భామ గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్ హీరోగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘రెడ్’ మూవీతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది అమృత అయ్యర్. ఈ భామ తన అందచందాలతో కుర్రాళ్లను ఎంతగానో అలరించింది. హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ‘అద్భుతం’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ మూవీలో శివాని తన సహజ నటన, గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News