Saturday, April 27, 2024

గుంటలో పడిన బైక్… ఇద్దరు సజీవదహనం…

- Advertisement -
- Advertisement -

Two Members dead in Bike accident in Medak

మెదక్: బైక్ గుంటలో పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమైన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలో శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నారాయణ్ ఖేడ్ మండలం మంగల్‌పేట్ గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్‌లు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. నారాయణ్ ఖేడ్ లో ద్విచక్ర వాహనం ఉండడంతో అవెంజర్ వాహనంపై సంగారెడ్డికి వెళ్తున్నారు. బొడ్మట్ పల్లి సమీపంలో రాంగ్ రూట్‌లో బైక్ వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ కోసం తవ్విన గుంటలో పడ్డారు. పెట్రోల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకొని ఇద్దరు సజీవదహనమయ్యారు. పాదచారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. వాసుదేవ్ కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తుండగా దత్తు గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News