దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్పై వరుసగా రెండో రోజు రాత్రిపూట కూడా అనేక వైమానిక దాడులు జరగడంతో 54 మంది మరణించారు. ఖాన్ యూనిస్లో అసోసియేటెడ్ ప్రెస్ కెమరామ్యాన్ గణించినదాన్ని బట్టి గురువారం రాత్రి 10 వైమానిక దాడులు జరిగాయి. మృతుల భౌతిక కాయాలను నగరంలోని నాస్సర్ హాస్పిటల్కు తరలించారు. మరణించిన వారిలో ఖతార్ టెలివిజన్ నెట్వర్క్ ‘అల్ అరబీ టివి’కి పనిచేస్తున్న జర్నలిస్టు కూడా ఉన్నారు. ఖాన్ యూనిస్పై జరిగిన వైమానిక దాడిలో జర్నలిస్ట్ హసన్ సమూర్ సహా ఆయన కుటుంబ సభ్యులు 11 మంది చనిపోయారు. వైమానిక దాడులపై ఇజ్రాయెల్ ఇప్పటికైతే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో 70 మంది మృతి చెందారు. వారిలో రెండు డజన్ల మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలావుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలోని గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారే తప్ప, ఇజ్రాయెల్కు వెళ్లడం లేదు. ఇజ్రాయెల్, గాజా ప్రాంతాన్ని బ్లాకేడ్ చేసి ఇప్పటికి మూడు నెలలు అవుతోంది.
దక్షిణ గాజా నగరంపై వైమానిక దాడులు: 54 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -