Friday, September 26, 2025

డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఇంట్లో విషాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వైవిఎస్ చౌదరి తల్లి రత్న కుమారి(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత రాత్రి రత్న కుమారి తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వైెవిఎస్ చౌదరి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Also Read: విజయవాడలో నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం…. సిసి కెమెరాలో రికార్డు

‘మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్ళని చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’.
కానీ.. ఒక లారీడ్రైవర్‌ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’ నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు.. సినిమాలు చూపించడం నుండి దేవాలయ దర్శనాలు, సీజనల్‌ పిండివంటలు, నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. ఎటువంటి లోటు రాకుండా.. తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మ..
వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మ..
అలా మా అమ్మకు తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా  అమ్మ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు’ అని వైవిఎస్ చౌదరి తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News