Sunday, April 28, 2024

వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం

- Advertisement -
- Advertisement -

వరంగల్ : – జిల్లాలోని రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం రైల్వేస్టేషన్‌లోని రేకుల షెడ్డుపై ఒకటో నెంబర్ ఫ్లాట్‌ఫామ్ వద్ద ప్రయాణికులు ఉన్న సమయంలో వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడి ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వాటర్ ట్యాంక్ పడిపోడానికి గల కారణాలపై రైల్వే సిబ్బంది ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News