Wednesday, May 15, 2024

ఈ నాలుగు రోజులకు అదనంగా 12 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లు

- Advertisement -
- Advertisement -

ఈనెల 11, 13, 14, 15వ తేదీల్లో
అదనంగా 12 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లు
ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణమధ్య రైల్వే

We will start passenger trains within month

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈనెల 11, 13, 14, 15వ తేదీల్లో అదనంగా 12 ప్యాసింజర్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ఇందులో భాగంగా నవంబర్ 11 నుంచి మిర్యాలగూడ టు నడికుడి (ట్రెయిన్ నెం:07277), నడికుడి టు మిర్యాలగూడ(ట్రెయిన్ నెం:07973) మధ్య రెండు ట్రైన్లతో పాటు ఇదే రోజు కాచిగూడ టు మిర్యాలగూడ (ట్రెయిన్ నెం:07276), మిర్యాలగూడ టు కాచిగూడ (ట్రెయిన్ నెం: 07974) మధ్య మరో రెండు ప్యాసింజర్ ట్రైన్లు నడుపనున్నారు.
నవంబర్ 13వ తేదీ నుంచి రేపల్లె టు తెనాలి…
నవంబర్ 13వ తేదీ నుంచి రేపల్లె టు తెనాలి (ట్రెయిన్ నెం: 07873-07875) తెనాలి టు రేపల్లె (ట్రెయిన్ నెం: 07874-07876) రూట్లలో మొత్తం నాలుగు ట్రైన్లను నడపనున్నారు. నవంబర్ 14 నుంచి నర్సాపూర్ టు విజయవాడ (ట్రెయిన్ నెం: 07044), విజయవాడ టు నర్సాపూర్ (ట్రెయిన్ నెం: 07045 మధ్య మరో రెండు రైళ్లను దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్ 15వ తేదీన కాచిగూడ టు రొటెగాన్(ట్రెయిన్ నెం:07571), రొటెగాన్ టు కాచిగూడ (ట్రెయిన్ నెం:07572) మధ్య రాకపోకలకు రెండు రైళ్లను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News