Tuesday, April 30, 2024

సింగూరును సందర్శించిన అదనపు కలెక్టర్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి/పుల్కల్: ఎడతెరపి లేని వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతున్నది . ఈ క్రమంలో గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. ఇరిగేషన్ అధికారులతో అక్కడ పరిస్థితి సమీక్షించారు. ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు తన వెంట స్థానిక ఇరిగేషన్ అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News