Sunday, May 5, 2024

ఆదిత్య ఎల్ 1 తొలి భూ కక్ష్య పెంపు విన్యాసం విజయవంతం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : దేశ తొలి సౌర పరిశీలన ఉపగ్రహం ‘ఆదిత్య ఎల్1’ ను నిర్దేశిత భూ కక్ష్యలోకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఆదివారం తొలి భూకక్ష పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్టు ఇస్రో వెల్లడించింది. బెంగళూరు లోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ ప్రక్రియను చేపట్టినట్టు తెలియజేసింది.

దీంతో ‘ఆదిత్య ఎల్1’ ఇప్పుడు 245x 22,459 కిలోమీటర్ల దూరం లోని కక్ష లోకి ప్రవేశించింది. మిషన్ అంతా సజావుగా సాగుతోందని, రెండో భూకక్ష పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 5న తెల్లవారు జామున 3 గంటలకు నిర్వహించనున్నట్టు చెప్పింది. ఆదిత్య ఎల్1 ఉపగ్రహంతో పీఎస్‌ఎల్‌వీ సీ 57 వాహకనౌక శనివారం శ్రీహరికోట లోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగి లోకి దూసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం తరువాత 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్షలో ప్రవేశ పెట్టింది.

16 రోజుల పాటు భూ కక్షల్లోనే చక్కర్లు కొట్టనున్న ‘ఆదిత్య ఎల్1’…. అనంతరం భూమికి 15 లక్షల కిమీ దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ఇస్రో తెలిపింది. ఇందులో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫోటో స్ఫియర్ , క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌరజ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News