Wednesday, May 15, 2024

పెద్ద మిషన్‌తో తిరిగి రాబోతున్నాడు

- Advertisement -
- Advertisement -

Adivi Sesh reminisces 3 years for Goodachari

 

యంగ్ హీరో అడవి శేష్.. క్షణం, అమీ తుమీ, గూఢచారి, ఎవరు వంటి వినూత్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. స్పై థ్రిల్లర్ కథాంశంతో 2018లో విడుదలైన ’గూఢచారి’ చిత్రం శేష్ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. లిమిటెడ్ బడ్జెట్‌తో చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించింది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అడవి శేష్ కథ, – స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అబ్బూరి రవి మాటల రాశాడు. ఇందులో శోభితా దూళిపాళ్ల హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, – ప్రకాష్ రాజ్, – సుప్రియ, – వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అభిషేక్ పిక్చర్స్, – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, – విస్తా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ‘గూఢచారి’ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ చేశారు.

ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంగళవారానికి (ఆగస్ట్ 3) మూడేళ్లు అయింది. ఈ నేపథ్యంలో హీరో – దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘గూఢచారి 2’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చారు. “గూఢచారి తెర మీదకు వచ్చి మూడు సంవత్సరాలు గడిచింది. ఉత్తమమైనది ఇంకా రావాల్సి ఉంది. అతను త్వరలో పెద్ద మిషన్‌తో తిరిగి రాబోతున్నాడు. ఈ నెలలోనే ‘గూఢచారి 2’ ప్రకటన వస్తుంది” అని అడవి శేష్ ట్వీట్ చేశారు. ఇక ’గూఢచారి 2’ చిత్రానికి కూడా శేష్ స్క్రిప్ట్ అందిస్తుండగా.. పార్ట్- 1 కు వర్క్ చేసిన మిగతా సాంకేతిక నిపుణులు అందరూ ఇందులో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News