మంచు మనోజ్ కథానాయకుడిగా శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘అహం బ్రహ్మాస్మి’. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎంఎం ఆర్ట్ బ్యానర్పై మంచు మనోజ్కుమార్, నిర్మలాదేవి నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మంచు మనోజ్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగా పవర్స్టార్ రామ్చరణ్ క్లాప్నిచ్చారు. మంచు లక్ష్మి, సుస్మిత కెమెరా స్విచాన్ చేశారు. విద్యా నిర్వాణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. మోహన్బాబు, పరుచూరి గోపాలకృష్ణ సంయుక్తంగా దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ “దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చడంతో మూడేళ్ల తర్వాత ఈ చిత్రం చేస్తున్నాను.
ఈ సినిమాతో ప్రేక్షకులు, అభిమానులను ఎంటర్టైన్ చేస్తానని ఆశిస్తున్నా”అని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ “ఈనెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. జూన్లోగా సినిమాను పూర్తిచేస్తాం. మే నెలలో పీటర్ హేన్స్ సారధ్యంలో హైదరాబాద్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తాం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం”అని చెప్పారు. ఈ సమావేశంలో సంగీత దర్శకులు అచ్చు రాజమణి, రమేష్ తమిళమణి, కథానాయిక ప్రియా భవానీ శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సముద్రకవి, మురళీశర్మ, రఘుబాబు, రాజీవ్ కనకాల, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సన్నీ కూరపాటి, ఎడిటింగ్ః తమ్మిరాజు, ఆర్ట్ః వివేక్ ఎ.ఎం.