Saturday, May 4, 2024

కన్నౌజ్ నుంచి లోక్‌సభ బరిలోకి అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

కన్నౌజ్:  లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ వ్యూహం మార్చినట్టే కనిపిస్తోంది. గత సంప్రదాయానికి భిన్నంగా ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీచేస్తున్నారు. ఈ నెల 12న ఇదే స్థానానికి మేనల్లుడు తేజ్‌ప్రతాప్ సింగ్ యాదవ్‌ పేరును ప్రకటించారు.

ఇప్పుడు అనూహ్యంగా ఆయనను మార్చేసి అక్కడి నుంచి అఖిలేశ్ బరిలోకి దిగారు. నేడు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. జిల్లా స్థాయిలో పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడి రావడంతోనే అఖిలేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ తెలిపింది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి డింపుల్ యాదవ్ పోటీచేశారు. ఈసారి తేజ్ ప్రతాప్‌ను ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వం సరైనదే అయినప్పటికీ… అఖిలేశ్ యాదవ్ అంతకు మించిన ఆప్షన్ అని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా బిజెపి ఎంపీ సుభ్రతా పాఠక్ ఈ పోటీని భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోటీగా అభివర్ణించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News