Saturday, May 4, 2024

హస్తినాపురంలో అంబులెన్స్ బోల్తా.. డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగరంలోని హస్తినాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం హస్తినాపురంలో ఓ అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది. అయితే, బోల్తా పడిన అంబులెన్స్‌ని తీసే క్రమంలో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో అంబులెన్స్ పూర్తిగా దగ్ధం కావడంతో అందులోని చిక్కుకున్న డ్రైవర్ మృతి చెందాడు.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News