- Advertisement -
అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మూడు రోజులపాటు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా శనివారం తిరుపతికి చేరుకోన్నారు. రేపు తిరుపతిలో అమిత్ షా అధ్యక్షతన జరగనున్న దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం తిరుపతిలోనే అమిత్ షా బస చేయనున్నారు. ఇక, సోమవారం ఉదయం తిరుమల స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత తిరుపతి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
Amit Shah comes to Tirupati for 3 days tour
- Advertisement -