ముంబయి: సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్కు కోపం వచ్చింది! ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే బిగ్బి తనపై సోషల్ మీడియాలో శాపనార్థాలు పెట్టిన ఒక అపరిచితుడిపై మండిపడ్డారు. కరోనా వైరస్తో తన చావును కోరుకున్న ఆ అజ్ఞాత వ్యక్తిపై విరుచుకుపడ్డారు. కొవిడ్-19 పాజిటివ్ రావడంతో 77 ఏళ్ల అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఆ అపరిచితుడిని సంబోధిస్తూ బిగ్ బి మంగళవారం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనలాంటి స్టార్ను పరుషంగా దూషించి పేరు సంపాదించుకోవాలని ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చారు.
నేను మరణిస్తే ఒక ప్రముఖ వ్యక్తిని పేరు పెట్టి దూషించే అవకాశం నీకు ఇక లభించదు. అమితాబ్ బచ్చన్ను తిట్టడం వల్లే నీకు పేరు వస్తుందని భావిస్తున్నట్లున్నావు. దేవుడి దయ వల్ల నా ఆరోగ్యం బాగుపడితే నన్ను దూషించినందుకు నా నుంచే కాక 90 కోట్ల మందికి పైగా ఉన్న నా అభిమానుల నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటావు. నన్ను ట్రోల్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నా అభిమానులను నేను కోరడం లేదు. కాని, కొవిడ్-19 నుంచి కోలుకుంటే ఆ పని నేనే చేస్తాను అంటూ అమితాబ్ హెచ్చరించారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికే మాయని మచ్చలాంటి వారని కూడా బిగ్ బీ వ్యాఖ్యానించారు.
Amitabh bachchan fire on unknown person tweet