Friday, May 3, 2024

చర్చనీయాంశమైన బిగ్‌బి పోస్టు

- Advertisement -
- Advertisement -

ముంబై : బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఎక్స్ (ట్విట్టర్) లో చేసిన పోస్టు వైరల్ అవడంతో పాటు చర్చనీయాంశంగా మారింది. భారత్‌గా మన దేశాన్ని సంబోధించేలా కేంద్ర కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ‘భారత్ మాతాకీ జై’ అంటూ పోస్టు పెట్టారు. రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో బిగ్‌బి పెట్టిన పోస్టు చర్చకు దారి తీసింది. అమితాబ్‌బచ్చన్ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతు పలుకుతుంటే.. ఇంకొందరు మాత్రం ’జయా జీ అంటే మీకు భయం లేదా సార్’ అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News