Sunday, May 5, 2024

మరో భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

Amul to invest Rs 500 crore for largest plant in Telangana

రూ.500 కోట్లతో అమూల్ బేకరి యూనిట్

మంత్రి కెటిఆర్ సమక్షంలో ఒప్పందం

రాష్ట్రంలో పాడి పరిశ్రమకు మరింత ప్రోత్సాహం, 500 మందికిపైగా ఉపాధి అవకాశాలు
ఉత్పత్తుల తయారీకి తెలంగాణ రైతుల నుంచే పాల సేకరణ
కెటిఆర్‌కు హామీ ఇచ్చిన అమూల్ కంపెనీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : డెయిరీ రంగంలో ప్రఖ్యాతగాంచిన దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టనున్నది. దాదాపు రూ.500 కోట్లను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమూల్ కంపెనీ తెలిపింది. బుధవారం అమూల్ కంపెనీ తరఫున సభార్కంత జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోపరేటివ్ సొసైటీ యూనియన్ ఎండీ బాబు, భాయ్ ఎం పటేల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, మంత్రి కెటిఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమూల్ కంపెనీకి మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సిఎం కెసిఆర్ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని, ఈ దిశగా వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలతో రాష్ట్రంలో పాడి రంగం భారీగా అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణలో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందన్నారు.

ఈ నేపథ్యంలో పెట్టుబడి పెట్టేందుకు అమూల్ తెలంగాణను ఎంచుకోవడం ద్వారా ఇక్కడి పాడి పరిశ్రమకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలోనే తన తొలి డెయిరీ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం పట్ల కంపెనీకి అభినందనలు తెలిపారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ల్లో రెండు దశల్లో మొత్తం ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు అమూల్ తెలిపింది. అమూల్ తన తొలి ప్లాంట్ ను ఐదు లక్షల లీటర్ల ప్రతిరోజు సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు, భవిష్యత్తులో దీన్ని పది లక్షల లీటర్ల కు పెంచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్లాంట్ నిర్మాణంతో బట్టర్ మిల్క్, పెరుగు, లస్సీ, పన్నీర్, స్వీట్స్ వంటి ఉత్పత్తులను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

దీంతోపాటు అమూల్ తన బేకరీ ప్రొడక్షన్ డివిజన్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసి బ్రెడ్, బిస్కెట్, ఇతర బేకరీ ప్రొడక్టులను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్ రానున్న 18 నుంచి 24 నెలలు లోగా కార్యకలాపాలను ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. తమ ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ రైతుల నుంచే సేకరిస్తామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు అమూల్ కంపెనీ హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయు చేసుకున్న నేపథ్యంలో అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌ఎస్ సోది తన శుభాకాంక్షలను తెలిపారు. కార్యక్రమంలో ముఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News