Monday, April 29, 2024

నల్లగొండకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

CM KCR review On integrated development of Nalgonda town

నల్లగొండ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికకు సిఎం కెసిఆర్ ఆదేశాలు
31న తొలుత రూ.110కోట్లతో ఐటిహబ్ శంకుస్థాపనకు అంగీకారం

దశాబ్దాలుగా నల్లగొండకు పట్టిన
దరిద్రం పోవాలి, అన్ని హంగులు,
మౌలిక వసతులతో పట్టణాన్ని తీర్చిదిద్దాలి
దీనికోసం ఎన్ని నిధులైనా మంజూరు
చేస్తాం ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో పాటు
రైతు బజార్ల నిర్మాణాలు ఆహ్లాదకరమైన
రీతిలో అర్బన్ పార్కు, 2 వేల
సామర్థానికి సరిపడ టౌన్‌హాల్,
శిల్పాకళాతోరణం ఏర్పాటు పానగల్
రిజర్వాయర్‌ను ట్యాంక్‌బండ్‌గా
తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
కలెక్టరేట్‌లో మంత్రులు, ఎంఎల్‌ఎలు, అధికారులతో జిల్లా సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లు

మనతెలంగాణ/నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రం నల్లగొండ పట్టణ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోదని స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌళిక వసతులతో తీర్చిదిద్దాలని, నల్లగొండ అభివృధ్దికి ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయిస్తుందని, ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని బుధవారం జిల్లా కేంద్రంలో సూర్యాపేట శాసనసభ్యుడు గాదరి కిషోర్ కుమార్ తండ్రి దశదినకర్మకు హాజరైన సిఎం అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నల్లగొండ పట్టణ సమగ్రాభివృద్ధ్దిపై విస్ర్తుతస్థాయిలో చర్చించి వెంటనే ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా అంగీకారానిక వచ్చిన ముఖ్యమంత్రి ఈ నెల 31వ తేదీన తొలుత రూ. 110 కోట్లతో ఐటి హబ్‌కు శంకుస్థాపన చేసేందుకు మంత్రులు కెటిఆర్, ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డిలు పర్యటిస్తారని అక్కడికక్కడే నిర్ణయించారు.

అదే క్రమంలో నల్లగొండ పట్టణంలో రెండు ఇంటిగ్రేటెడ్ సూపర్‌మార్కెట్‌ల నిర్మాణంతో పాటు పానగల్ రిజర్వాయర్‌ను ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు యుద్దప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధ్దం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో కూలకషంగా జరిగిన చర్చల నేపథ్యంలో నల్లగొండ పట్టణంలో శిల్పకళాతోరణం ఏర్పాటు చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. అదే విదంగా మరో రూ. 36 కోట్లతో నూతన డిగ్రీ కాలేజి భవనం ఏర్పాటుకు మంజూరు చేయడంతో పాటు వెంటనే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పట్టణంలోని ప్రధార రహదారులన్నింటిని వెడల్పు చేయడంతో పాటు నూతన టౌన్‌హాల్ నిర్మాణం, పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు, పనుల పురోగతిని కూడా సీఎం కెసిఆర్ మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షించారు. అనంతరం పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న టౌన్‌హాల్‌తో పాటు నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖ కార్యాల యాల ప్రాంతాలకు చేరుకున్న సీఎం పరిశీలించి పునరుద్దరణకు తగు సూచనలు చేశారు. నల్లగొండ మున్సిపాలిటీలో మౌళిక వసతుల మెరుగు పర్చడం, పలు అభివృధ్ధి కార్యక్రమాలను చేపట్టే విషయమై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సిఎం. కెసిఆర్ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో కూడిన సమీక్షా సమావేశం నిర్వహించారు.

నల్లగొండ అభివృధ్దికోసం పట్టణంలో పర్యటించి, అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ను, ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆదేశించారు. పాదయాత్రలు చేపట్టి అభివృధ్ధికోసం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నల్లగొండ పట్టణ అభివృధ్దికోసం నిబద్దతో పనిచేసే మున్సిపల్ కమీషనర్‌ను వెంటనే నియమించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ మేరకు సిద్దిపేట మున్సిపల్ కమీషనర్ రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాల్సిందిగా సిఎం కెసిఆర్ ఫోన్లో ఆదేశించారు. నల్లగొండను అభివృద్ది చేసేదాక నిద్రపోవద్దని , సిద్దిపేటను తీర్చిదిద్దినట్టుగా నల్లగొండనూ తీర్చిదిద్దాలన్నారు. ఈసమీక్ష సమావేశంలో మంత్రులు జి. జగదీవ్వర్‌రెడ్డి, హరీష్‌రావు,వి. శ్రీనివాస్‌గౌడ్, ఎంపి. బడుగుల లింగ య్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంసి. కోటిరెడ్డి, ఎంఎల్‌ఏలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, రవీంద్ర నాయక్, బాస్కర్‌రావు, జెడ్‌పి చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజి మంత్రి మోత్కుపల్లి నిర్సంహులు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పలుశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలో మురుగునీటి అండర్ డ్రైనేజి కాల్వలు, ఆటల కోసం స్టేడియం, పట్టణవాసులకోసం ఇంటిగ్రేటెడ్‌వెజ్,, నాన్ వెజ్ మార్కెట్‌లు, రైతు బజార్లు, దవాఖానాలు, రోడ్లు తదితర మౌళిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అంటూ… సంబందిత అధికారులను సిఎం కెసిఆర్ ఆరా తీశారు. నల్లగొండలో స్ట్రీట్ లైట్ పరిస్థితిని సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. నల్లగొండలో విద్యుత్ పరిస్థితిని మెరుగు పరిచేందుకు వెంటనే కావల్సినన్ని సబ్‌స్టేషన్లను నిర్మించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను సిఎం ఆదేశించారు.పట్టణంలో అనువైన స్థలాలను ఎంపిక చేసుకుని , వాటిలో వెంలనే ఇంటిట్రేటెడ్ మార్కెట్‌ల నిర్మాణం చేపట్టాలని , రైత బజార్లు నిర్మించాలన్నారు. ఉదయ సముద్రం అద్బుతమైన నీటి వసతితతో కళకళలాడుతున్న నేపధ్యంలో ట్యాంక్‌బండ్‌ను సుందరీకరించాలని చెప్పారు. నల్లగొండ వాసులకు ఆహ్లాదకరమైన రీతిలో అర్బన్ పార్కును అందుబాటులోకి తేవాలన్నారు. సభలు , సమావేశాలకోసం అధునాతన సౌకర్యాలతో రెండువేల మంది సామర్థంతో కూడిన టౌన్ హాల్ నిర్మించాలన్నారు.

ఇందుకోసం నగరం నడిబొడ్డున అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని స్థానిక ఎంఎల్‌ఏను, జిల్లా కలెక్టర్‌ను సిఎం ఆదేశించారు. నల్లగొండలో జనాభా పెరుగుతున్నందున పాదచారులకోసం ఫుట్‌పాత్‌లను నిర్మించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. ఉప్పల్ భగాయత్ మాదిరిగా లాండ్ పూలింగ్ చేపట్టి, కాలనీల నిర్మాణానికి పూనుకోవాలన్నారు. గతంలో నల్లగొండ పట్టణంలో త్రాగు నీటి సమస్య ఎక్కువగా ఉండేదని, మిషన్ భగీరథ పథకంతో ఆ సమస్య తీరిపోయిందని అధికారులు సిఎంకు వివరించారు. నల్లగొండలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పురోగతిపై పిఎం ఆరా తీశారు. నల్లగొండ లో వైకుంఠధామంల పరస్థితిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి హిందువులకు , ముస్లీంలకు , క్రిస్టియన్‌లకు వేర్వేరుగా శ్మశాన వాటికల నిర్మాణాన్ని ప్రత్యేకంగా చేపట్టాలన్నారు.

ప్రాజెక్టు కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు

ప్రాజెక్టు నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయి దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు ఇంటి కార్వర్టర్‌లకు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా అక్కడే నివాసం ఏర్పరుచుకున్న కాలనీ వాసులతో పాటు, నిజామాబాద్ ఖమ్మం, తదితర జిల్లాల్లో ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలు ఉన్నాయని అక్కడ కూడా అర్హులైన వారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తం గా ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తు న్న వారికి శాశ్వత పట్టాలు కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని సిఎస్ సోమేశ్‌కుమార్‌ను సిఎం కెసిఆర్ ఫోన్లో ఆదేశించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొని అక్కడే నివాసం ఉంటున్న కాలనీ వాసులకు పట్టాలిస్తామని గతంలో మాట ఇచ్చామని, ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మాట ఇచ్చనప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం ధర్మమని, మనది ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని, ప్రజా ప్రతినిధులకు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌కూడా తొలగిపోయినందున అర్హులైన సాగర్ కాలనీవాసులకు, నియమనిబంధనలను అనుసరించి, కొంత వెసులుబాటును కల్పించైనా సరే, పట్టాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దాల క్రితం ప్రాజెక్టుల నిర్మాణాల సందర్బంగా పేద కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ప్రజలే అధికంగా పాల్గొన్నారు, వారు ఇక్కడే నివాసమున్నారు, అలాంటిదే ఇక్కడ కూడాఇ నాగార్జున సాగర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది.వారంతా తక్కువ స్థలాలలోనే ఇండ్లు కట్టుకన్నారు , వారందరికి పటాట్టాలివ్వాల్సిన బాధ్యత ప్రభ్తువం మీదనే ఉన్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

టౌన్‌హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన

సమీక్షా సమావేశం అనంతరం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్‌లో ఉన్న ఇరిగేషన్, ఆర్‌అండ్‌బి కార్యాలయాల సిఎం కెసిఆర్ నల్లగొండ టౌన్‌హాల్ నిర్మాణానికి అనువుగా ఉంటుందా … అనే విషయాన్ని తెలుసుకునేందుకు సిఎం కెసిఆర్ స్వయంగా పరిశీలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News