Sunday, April 28, 2024

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి పెద్దపల్లి మండలం రాఘవాపూర్ రైల్వే ట్రాక్ పక్కన సుమారు 35 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సున్న మృతదేహం గుర్తించినట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.

మృతుడు ప్రమాదవశాత్తు ట్రైన్ నుండి పడిపోయినట్లు కనపడుతుందని, అతడు స్కైబ్లూ కలర్ టీ షర్టు, నేవీ బ్లూ కలర్ లోయర్ వేసుకున్నట్లు తెలిపారు. తల, చేతులపై రక్తగాయాలు ఉన్నాయన్నారు. మృతున్ని ఎవరైనా గుర్తిస్తే 87126 56509 నెంబర్‌కు సంప్రదించాలని ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News